కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీలో అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ఓటమికి నువ్వంటే నవ్వు కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదే సమయంలో మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నాయకుడు తథాగతరాయ్.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తిగా విజయవర్గీయ, ఘోష్లదే అని కుండబద్దలు కొట్టారు.
ఎన్నికల సమయం వరకు బెంగాల్లో బీజేపీ బలమైన పార్టీగా నిలిచిందని తథాగత రాయ్ చెప్పారు. అయితే, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, బీ ఫారంలు అందజేయడం కైలాష్ విజయవర్గియా, బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ లే చూడటం వల్ల చెత్త అభ్యర్థులు బరిలో నిలువాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ఓటమి ముమ్మాటికి విజయవర్గీయ, ఘోష్లదే కానీ, నరేంద్ర మోదీ, అమిత్షాలది మాత్రం కాదన్నారు. వీళ్లిద్దరే మోదీ, అమిత్ షాను బురదలోకి లాగి పరువు తీశారని అన్నారు.
వీరిద్దరూ బెంగాల్ లోని స్టార్ హోటళ్ళలో కూర్చుని తృణమూల్ నుండి వచ్చిన చెత్తకు టిక్కెట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారే కానీ బీజేపీ కార్యకర్తలను ఆదుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలకు అండగా నిలువాలని ఆయన సూచించారు.
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
రెజ్లర్ సుశీల్పై హత్య కేసు.. ఛత్రసాల్ స్టేడియంలో ఘర్షణ
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
కరోనాతో నటి అభిలాషా పాటిల్ కన్నుమూత
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
ఒకే కాన్పులో 9 మంది జననం.. మాలిలో ఘటన
నియంత్రణ కోల్పోయిన చైనా రాకెట్.. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..