తిరుమల : టీటీడీ( TTD ) నూతన జేఈవో (వైద్యం మరియు విద్య) గా ప్రభల గోపీనాథ్( Gopinath ) సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీకి ట్రక్ విరాళం
తిరుపతికి చెందిన వేంకటేశ్వర మోటార్స్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి సోమవారం రూ.15.24 లక్షలు విలువైన ఎస్.ఎం.ఎల్.మహీంద్ర ట్రక్ ను విరాళంగా( Truck Donation ) అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు వాహన తాళాలను అందజేశారు.