ఖాట్మండు: భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ డ్యూబా చెప్పారు. తద్వారా భారత్తో నేపాల్ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్తో కలిసి పనిచేయడం ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాన్ని కూడా బలోపేతం చేయవచ్చునన్నారు. నేపాల్ ప్రధానిగా డ్యూబా ఎన్నికైన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందన సందేశం పంపారు. దీనికి ప్రతిస్పందనగా డ్యూబా సోషల్ మీడియాలో తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.
షేర్ బహదూర్ డ్యూబా వయసు 75 సంవత్సరాలు. డ్యూబాను భారత అనుకూల నేపాలీ నాయకుడిగా పరిగణిస్తారు. నేపాల్లో రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం దృష్ట్యా డ్యూబాను ప్రధానిగా నియమించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో డ్యూబా ఈ నెల 13 న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజుల క్రితం పార్లమెంటులో జరిగిన బలనిరూపణలో డ్యూబా 165 ఓట్లలో 83 గెలుచుకున్నారు.
ప్రధానిగా బలం నిరూపించుకోగానే భారత ప్రధాని మోదీ ఆదివారం రాత్రి డ్యూబాకు అభినందన సందేశం పంపారు. దానికి డ్యూబా వెంటనే సమాధానం ఇచ్చారు. వామపక్ష సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా ఉన్న ప్రధాని కేపీ శర్మ ఒలి హయాంలో భారత్-నేపాల్ సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాలు, దేశ భౌగోళిక పటం వివాదాలు, సరిహద్దులోని భద్రతా దళాల మధ్య అప్పుడప్పుడు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. నూతన ప్రధానిగా ఎంపికైన డ్యూబా భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని పేర్కొనడంతో.. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయని నిపుణులు భావిస్తున్నారు.
మెక్సికో మాజీ అధ్యక్షులపై ఆగస్టు 1 న రెఫరెండం
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
చరిత్రలో ఈరోజు.. విభజించు పాలించు ప్రారంభం
England Vs Pakistan | సిక్స్ కొడితే.. దద్దరిల్లిపోయింది..!
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..