యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనే నాథుడులేక అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా ధాన్యం కొనుగోళ్లు(Grain Purchases) జరపాలంటూ.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామ రైతులు ఆందోళన బాట(Farmers Dharna) పట్టారు. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు సెంటర్లో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదంటూ అన్న దాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చౌటుప్పల్-జూలూర్ రహదారిపై కంప చెట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా తడిసి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు జరిపేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి ధర్నా విరమింజేసే ప్రయత్నం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు జరపాలంటూ.. రహదారిపై అన్నదాతలు ధర్నా
యాదాద్రి భువనగిరి – భూధాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలోని ఐకేపీ కొనుగోలు సెంటర్లో గత వారం రోజులుగా ధాన్యం కొనుగోళ్లు జరపడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో అకాల వర్షాలకు తమ ధాన్యం అంతా… pic.twitter.com/kdbBaITcAY
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2024