కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలం గాణ)/బెజ్జూర్, ఏప్రిల్ 18 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరం నుంచే జీవనది ప్రాణహిత ఏడాదంతా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణహిత పక్కనే ఉన్నా పొలాలకు మాత్రం నీటి చుక్క అందడం లేదు. బెజ్జూర్ మండలంలో దాదాపు 30 మంది రైతులు 100కు పైగా బోర్లు వేశారు. 300-400 అడుగుల లోతుకు వేసినప్పటికీ ఒక్క బోరులో కూడా నీటి చుక్క కనిపిం చ లేదు. తమ ప్రాంతంలో సారవంతమైన భూములు ఉన్నప్పటికీ భూగర్భజలాలు లేక పోవడంతో కేవలం వర్షాధార పంటలకు మాత్రమే పరిమితం అవుతున్నామని రైతు లు పేర్కొంటున్నారు. మండలంలో గొల్ల బా యి చెరువు, స్ప్రింగానికల్ మత్తడి ఉన్నప్ప టికీ వీటి ద్వారా కూడా వర్షాకాలంలో తప్పా మిగతా కాలంలో నీరు అందడం లేదు.
బోరుబావిలోనికి ఆశగా చూస్తున్న రైతు నాగుల రవి. ఇతనిది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం. ఇతనికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షాకాలం, యాసంగిలో పంటలు వేసుకోవాలని ఆశపడ్డాడు. తన చేనులో 300 అడుగుల చొప్పున మూడు బోర్లు వేశాడు. ఒక్కో బోరుకు లక్ష రూపాయల చొప్పున రూ.3 లక్షలు ఖర్చు చేశాడు. అయినప్పటికీ చుక్క నీరు పడలేదు. కేవలం వర్షాధార పంటకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
చిత్రంలో కనిపిస్తున్న రైతు ఏలేశ్వరం వెంకటయ్య. ఇతనిది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం. తనకున్న ఐదెకరాల్లో మూడు బోర్లు వేశాడు. ఒక్క బోరులో కూడా నీళ్లు పడలేదు. ఇప్పటివరకు దాదాపు రూ.3లక్షలు ఖర్చు చేశారు. చివరకు చేసేదేమి లేక వర్షాధార పంటపైనే ఆధారపడుతున్నాడు. సారవంతమైన భూమి, గత ప్రభుత్వం తన పొలంలో నుంచి వేసిన ఉచిత విద్యుత్లైన్ ఉన్నా యాసంగి పంట పండించుకోలేని దుస్థితిలో ఉన్నాడు.