మందమర్రి, ఏప్రిల్ 29 : మే 4న మంచిర్యాల పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ము ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రోడ్ షోను విజయవంతం చేయాలని చె న్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ శ్రేణులను కోరారు. సోమవారం మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ నివాసంలో ఏర్పా టు చేసిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ రోడ్ షోకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించాలన్నారు. పట్టణంలో ఇంటింటా ఎ న్నికల ప్రచారం నిర్వహించాలని, మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు. మే 7న క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్లో బూత్ లెవల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల సందర్భంగా కేసీఆర్ రోడ్ షో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, అన్ని ప్రాంతాలలో విశేష స్పందన లభిస్తున్నదని చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనలకు సంబంధించిన వివరాలను నాయకులకు వివరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్, ఎండి.అబ్బాస్, బత్తుల శ్రీనివాస్, మద్ది శంకర్, బడికెల సంపత్కుమార్, బండారు సూరిబాబు, బర్ల సదానందం, ఈశ్వర్, వేణుగోపాల్ రెడ్డి, సీసెల్లి సాగర్, తదితరులు పాల్గొన్నారు.