రెబ్బెన, ఏప్రిల్ 29 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అబ్జర్వర్ రాజేశ్కుమార్సక్సేనా ఐపీఎస్(ఐజీపీ) సూచించారు.
సోమవారం రేపల్లెవాడ ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్పోస్ట్ను కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిబ్బంది పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సురేశ్కుమార్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ డీఎస్పీలు సదయ్య, కరుణాకర్, రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్ ఉన్నారు.