బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgan) తొలిసారి ఓటీటీ ప్రాజెక్టు రుద్ర (Rudra) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కోలీవుడ్ (Kollywood) హీరోయిన్ రాశీఖన్నా (Raashii Khanna) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టులో రాశీఖన్నా డార్క్ రోల్లో కనిపించనుందట. ఇదివరకెన్నడూ పోషించనట్వంటి సైకో కిల్లర్ పాత్రలో కనిపించనుందని ఓ అప్ డేట్ ఇచ్చింది రాశీఖన్నా.
Raashii Khanna | రాశీఖన్నా యూట్యూబ్ ఛానల్..విశేషాలివే..వీడియో
దీని గురించి రాశీఖన్నా మాట్లాడుతూ..నా కెరీర్లో పోషించిన పాత్ర చేస్తున్నాను. ఇది చాలా కష్టమైన పాత్ర. తెరపై నా రోల్ అందరినీ షాక్కు గురిచేయడం పక్కా అని చెప్పుకొచ్చింది. రుద్ర త్వరలోనే హాట్స్టార్లో ప్రీమియర్ కానుంది. మరోవైపు రాశీఖన్నా, గోపీచంద్తో కలిసి నటించిన పక్కా కమర్షియల్ మే 20న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రాశీఖన్నాకు కూడా రుద్ర తొలి డిజిటల్ డెబ్యూ ప్రాజెక్టు కావడం విశేషం.
Sidharth Kiara vacation | రొమాంటిక్ వెకేషన్..మాల్దీవుల్లో బాలీవుడ్ ప్రేమ పక్షులు
తెలుగులో నాగచైతన్యతో కలిసి థాంక్యూ సినిమా చేస్తోంది. దీంతోపాటు తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీగా ఉంది. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి యోధ ప్రాజెక్టులో నటిస్తుండగా..ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
రుద్ర ట్రైలర్ :