లవ్ బర్డ్స్ తోపాటు కొత్తగా పెళ్లయిన సెలబ్రిటీలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకునే టూరిజం స్పాట్ మాల్దీవులు (Maldives). నిత్యం సెలబ్రిటీల సందడితో కలకలలాడిపోతూ ఉంటుందీ ప్రాంతం. తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ అక్కడికి వెళ్లి ప్రకృతి సోయగాలు, అందాలను తనివి తీరా ఆస్వాదిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలిద్దరూ ఇదే లొకేషన్ లో రొమాంటిక్ వెకేషన్ (Romantic vacation) లో బిజీగా ఉన్నారు. ఇంతకీ వారెవరో ఈపాటికే అర్థమై ఉంటుంది.
సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ (Sidharth Malhotra-Kiara Advani)..చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ వార్తల్లో నిలిచే ఈ స్టార్ సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎక్జయిటింగ్, అడ్వెంచరస్ హాలీడే మూడ్ను తెగ ఎంజాయ్ చేశారు. దీనికి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఫొటోలే ఉదాహరణ. తన్మయత్వంతో నిండిపోయినట్టుగా బీచ్ వెకేషన్లో సహజ సిద్దమైన అందాలను ఆస్వాదించారు. కియారా అద్వానీ గోల్డెన్ కలర్ బీచ్ వేర్లో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ పోజులిచ్చింది.
ఇసుక తిన్నెల్లో ఆకుపచ్చని బికినీ వేర్లో పరుగులు పెడుతూ..మరోవైపు బోటులో విహరిస్తూ సముద్రనీటిపై భాగానికి వచ్చి వెళ్తున్నడాల్ఫిన్స్ ను వీక్షిస్తూ సరదా సమయాన్ని గడిపింది. జనవరి-ఏప్రిల్ సీజన్ల డాల్ఫిన్లు సముద్రనీటిపైభాగానికి వచ్చి వెళ్తూ సందడి చేస్తుంటాయి. సో మీరు కూడా నెక్ట్స్ టైం ఎప్పుడైనా మాల్దీవులు టూర్కు వెళ్లాలనుకుంటే ఇదే సీజన్లో వెళ్లడం మర్చిపోకండి మరి అంటూ చెప్పకనే చెబుతున్నారు సిద్దార్థ్-కియారా.
ఈ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారని ఇప్పటికే చాలా సార్లు వార్తలు తెరపైకి వచ్చినా..వాళ్లు మాత్రం ఎప్పుడు స్పందించలేదు.