దీపం ఉండగానే అందాల ముద్దుగుమ్మలు ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. వరుస ప్రాజెక్ట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఖరీదైన బిల్డింగ్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ కొద్ది రోజుల క్రితం రూ.2.43 కోట్ల కారును తనకు తానే గిఫ్ట్గా ఇచ్చుకుంది. మెర్సిడెస్- మేబాచ్ జీఎల్ఎస్ 600 కారు చాలా లగ్జరియస్ కారు అని చెబుతున్నారు.
ఇక తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ని షేక్ చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆడి A8L లగ్జరీ సెడాన్ను కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిక్స్ లో ఈ బ్యూటీ పింక్ ప్యాంట్తో తెల్లటి టాప్తో చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
ఆడి ఈ మోడల్ను గత ఏడాది భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.56 కోట్లు. కియారా దగ్గర ఇప్పటికే BMWX5, Mercedes Benz E Class, BMW 530d ఉన్నాయి. ఈ వాహనాలన్నీ చాలా ఖరీదైనవి. రీసెంట్గా కియారా షేర్ షా చిత్రంతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి.