శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని హంజిన్ రాజ్పోరా ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఉగ్రవాదులు, భద్రతా దళాలత మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న భదత్రా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇదిలా ఉండగా అనంతనాగ్ జిల్లాలోని లాజీబాల్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీస్ పార్టీపై ఉగ్రవాది తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీస్కు స్వల్ప గాయాలయ్యాయని అనంతనాగ్ పోలీసులు ట్వీట్ చేశారు.