బొల్లారం, మే 2: బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదరించి, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను బొందపెట్టాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పారిశ్రామికవాడ ప్రజలను విజ్ఞప్తి చేశారు. గురువారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కొత్త బస్టాండ్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి రోడ్డుషోలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక హామీ అమలు చేయలేదన్నారు. 6 గ్యారెంటీల్లో ఒకటన్న అమలైందాఅని ప్రశ్నించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పటాన్చెరు ప్రాంతానికి చెందిన వాడని, మంచి పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి, పేద విద్యార్థుల కోసం రూ.100 కోట్లతో ట్రస్ట్ పెట్టి సేవలందిస్తున్నారని తెలిపారు. మే 13న కారుగుర్తుపై ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రోజారాణి, మాజీ జడ్పీటీసీ బాల్రెడ్డి, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.