జమ్ము : కరోనా వైరస్ ప్రభావం వైష్ణో దేవీ యాత్రపై పడింది. ప్రతి సంవత్సరం సగటున 80 లక్షల మంది భక్తులు సందర్శిస్తుండగా.. 2020 లో 17 లక్షలు మాత్రమే వచ్చారు. మే నెలలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో రోజుకు 45 మంది మాత్రమే దర్శించుకున్నారు. 2020 లో కరోనా ఉద్ధృతి మొదలైన కొద్ది రోజుల తర్వాత వైష్ణో దేవి యాత్ర నిలిచిపోయింది. ఆలయం దాదాపు నాలుగు నెలలు మూసివుంచారు. 2021 లో కరోనా సెకండ్ వేవ్లో ఆలయాన్ని తెరిచి ఉంచినప్పటికీ భక్తులు సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది.
జూన్ నెలలో ప్రయాణికుల సంఖ్య మళ్లీ పెరగడం ప్రారంభమైంది. 2018 లో 85 లక్షల మంది భక్తులు మాతా వైష్ణో దేవిని సందర్శించారు. ఇదే సమయంలో 2019 లో ఆర్టికల్ 370 ను తొలగించిన కారణంగా, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. 2019 లో కేవలం 79 లక్షల 40 వేల మంది మాత్రమే దర్శనం కోసం వచ్చారు. కరోనా ప్రభావం 2020 లో స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది కేవలం 17.20 లక్షల మంది వచ్చారు. అనంతరం నాలుగు నెలలపాటు ఆలయాన్ని మూసివేశారు. 2021 జనవరి, ఫిబ్రవరి నెలల్లో తిరిగి యాత్రికుల సంఖ్య పెరిగింది. ఈ రెండు నెలల్లో 7 లక్షల మంది యాత్రికులు దర్శనం కోసం వచ్చారు. కాగా, 2017 లో 81.78 లక్షల మంది భక్తులు రాగా, 2012 లో అత్యధికంగా 1.04 కోట్ల మంది దర్శించుకున్నారు.
“నేను వైష్ణో మాతా యాత్రకు చాలాసార్లు వెళ్ళాను. కాని ఇంత తక్కువ సంఖ్యలో భక్తులను చూడటం ఇదే మొదటిసారి. ఓపెన్ దర్శనం మొదటిసారి చాలా తేలికగా ఉన్నదని” ఢిల్లీకి చెందిన భక్తుడు రాకేశ్ తన ఆనుభవాన్ని పంచుకున్నారు.
ప్రపంచ పర్యావరణ దినం: పీపీఈ కిట్ భూమిలో కరగడానికి 500 ఏండ్లు
చరిత్రలో ఈరోజు : ఐదుగురిలో తొలిసారి ఎయిడ్స్ గుర్తింపు
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..