నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తారానగర్ సెక్షన్ పాపిరెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వ్యాపార ప్రకటనల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఈదురు గాలులకు చెల్లాచెదురై గాలిలో ఎగురుతూ విద్యుత్ తీగలపై పడ్డాయి. ఇలాంటి ఘటనలు నగరంలోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, మూసాపేట ప్రాంతాల్లో జరిగాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఫ్లెక్సీలు విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.గన్రాక్ ఎయిర్పోర్టు ఫీడర్ పరిధిలో విద్యుత్ సమస్యలు తలెత్తాయి.