AP News | పెళ్లిచూపుల కోసం ఇంటికి వెళ్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగళూరు నుంచి ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం గ్రామానికి చెందిన పాలకుర్తి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు సందీప్ (31) ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కొంతకాలం అమెరికాలోనూ ఉద్యోగం చేశాడు. అయితే విదేశాల్లో ఉండటం కంటే.. స్వదేశంలో ఏదో ఒక జాబ్ చేసుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో అక్కడి నుంచి వచ్చేశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో ఇటీవల సందీప్కు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో బెంగళూరు నుంచి స్వదేశానికి బయల్దేరాడు. ఈ క్రమంలో ఐతేపల్లి సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శనివారం వేకువజామున సందీప్ ప్రయాణిస్తున్న కారు.. ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.