రాయపోల్ : ఎల్నినో ( El Nino) ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ ( Babu Naik ) సూచించారు.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి, బేగంపేట్, వీరారెడ్డిపల్లి, , మంతూర్, అనాజిపుర్ , చిన్నమాసంపల్లి. కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరికి బదులు జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ తదితర ప్రత్యామ్నాయ (ఐడి) పంటలను సాగు చేయడం వల్ల తక్కువ నీటితో మెరుగైన దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఫార్మ్ పాండ్స్ సబ్సిడీ పథకాన్ని సద్వినియోగించుకోని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా పంటలకు అవసరమైన సమయంలో జీవనాధార నీటిపారుదల (Life Saving Irrigation) అందించవచ్చని వెల్లడించారు. . కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ ,ఏపీవో జనార్ధన్ ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.