న్యూఢిల్లీ: కేరళకు చెందిన మాజీ ఎంపీ జాయిస్ జార్జ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ ఓ బ్యాచిలర్ అని, ఆయనతో జాగ్రత్త అని కాలేజీ విద్యార్థినులను ఆయన హెచ్చరించారు. రాహుల్ గాంధీ కేవలం మహిళల కాలేజీలకే వెళ్తారు. అక్కడికి వెళ్లి విద్యార్థినులను కాస్త ఒంగమని చెబుతారు. కానీ దయచేసి అలా చేయొద్దు. ఆయనకు పెళ్లి కాలేదు. ఆయన పని ఇదే అని జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇడుక్కి జిల్లాలో ఎంఎం మణి అనే అభ్యర్థి తరఫున పోటీ చేస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇడుక్కి నుంచే గతంలో ఎల్డీఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్ ఎంపీగా ఆయన గెలిచారు.
కొచ్చిలో సెయింట్ థెరెసా కాలేజీ విద్యార్థినులకు ఈ మధ్య రాహుల్ గాంధీ ఐకిడో శిక్షణ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జాయిస్ జార్జ్ ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. ఐకిడోలో నిపుణుడైన రాహుల్.. విద్యార్థునిలు తమను తాము ఎలా రక్షించుకోవచ్చో చెబుతూ వాళ్లకు శిక్షణ ఇచ్చారు. దీనిపై జాయిస్ చేసిన కామెంట్స్ను కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల తీవ్రంగా ఖండించారు. రాహుల్తోపాటు మహిళలను కూడా ఆయన అవమానించారని ఆయన అన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
సాఫ్ట్ సిగ్నల్ లేదు, 90 నిమిషాల్లోపే 20 ఓవర్లు.. ఐపీఎల్లో కొత్త రూల్స్
భన్సాలీపై అలిగిన దీపికా.. కారణం అదేనా?
నన్ను మిస్ అవుతున్నారా.. పెళ్లికి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్
కొవిడ్ నిబంధనలు.. రూ. 35 వేల కోట్ల నష్టం