Sunita Kejriwal | ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) గొంతు ప్రజల్లోకి వెళ్లకుండా జైల్లో పెట్టారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) అన్నారు. మద్యం కుంభకోణం ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీతా కేజ్రీవాల్ ఆ పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.
ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భర్త అరెస్ట్పై స్పందించారు. ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకుండా జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రజలే ఓట్ల ద్వారా సమాధానం చెబుతారని అన్నారు.
#WATCH | Ahmedabad, Gujarat: Delhi CM Arvind Kejriwal’s wife Sunita Kejriwal says, “They have jailed Arvind Kejriwal during the time of elections so that his voice cannot reach the people… The people will give their reply to this through votes…” pic.twitter.com/HxkmNXiXDh
— ANI (@ANI) May 2, 2024
Also Read..
Naveen Patnaik | కాంతాబంజీ స్థానానికి నామినేషన్ వేసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
Brij Bhushan | బ్రిజ్ భూషణ్కు బీజేపీ షాక్.. కైసర్గంజ్ నుంచి ఆయన కుమారుడికి అవకాశం..!
Amitabh Bachchan | టీ20 వరల్డ్ కప్ భారత జట్టుకు అమితాబ్ స్పెషల్ మెసేజ్.. ఇది మహా యుద్ధం అంటూ..