Crop Loss | చిలిపిచెడ్, అక్టోబర్ 1 : అకాలవర్షాలతో రైతన్నలు ఆగమాగం అయ్యారని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి కే నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిలిపిచెడ్ మండల పార్టీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత 20 రోజులుగా కురిసిన అకాల వర్షాలతో సింగూరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో చిలిపిచెడ్ మండలం, కౌడిపల్లి మండలలో అనేక పంటలు మునిగిపోయాయన్నారు.
రైతులు పంట చేతికి వస్తే కుటుంబ అవసరాలు తీరుతాయని ఆశగా చూస్తుంటే.. పంట మునిగిపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం నుండి రైతులకు ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి, కనీసం రైతులను కన్నెత్తి కూడా చూడకపోవడం దుర్మార్గం అన్నారు. ఇప్పటికే గ్రామాలలో పంట పొలాలను పరిశీలించి వ్యవసాయ శాఖ సభలు నిర్వహించి, నష్టం అంచనా వేయాల్సింది కానీ అధికారులు ఎందుకు అంచనా వేయలేదని ప్రశ్నించారు.
ఇప్పటికైనా గ్రామాలలో పంట నష్టం ఎంత అనేది పరిశీలించి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ మల్లేశం, కార్యవర్గ సభ్యులు కడారి నాగరాజు, ఏరియా కమిటీ సభ్యులు డి మల్లేశం, నాయకులు శేఖర్, నర్సింలు, పోచయ్య, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగు బంధం.. కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం: హరీశ్ రావు
DA hike | పండగ వేళ గుడ్న్యూస్ చెప్పనున్న కేంద్రం.. ఉద్యోగులకు డీఏ పెంపు..?
Asia Cup | ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐకి క్షమాపణలు చెప్పిన పీసీబీ చైర్మన్ నఖ్వీ..!