హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పనితీరుపై సీపీఎం(CPM party) పార్టీకి తత్వం బోధపడినట్లుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు తెగ తాపత్రయపడిన ఆ పార్టీకి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ చూపించింది. చివరి వరకు వేచి ఉంచి టికెట్ల విషయంలో పీటముడి వేసి పొత్తు విచ్ఛిన్నం అయ్యేలా చూసింది. దీంతో సీపీఎం ఒంటరిగానే పోటీలో నిలబడింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ అవడంతో ఆ పార్టీ కళ్లు తెరిచింది.
ఎన్నికల్లో పొత్తు కుదరకపోవడంతో భువనగిరిలో(Bhuvanagiri) ఒంటరిగానే పోటీలో నిలిచింది. అయితే సీపీఎం భువనగిరి అభ్యర్థి జహంగీర్ను పోటీ నుంచి ఉపసంహరించుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి కోరికను కామ్రేడ్లు తోసిపుచ్చారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని బృందంతో తన నివాసంలో సమావేశమయ్యారు. దేశంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకు సరేనన్న సీపీఎం భువనగిరిలో మాత్రం తమకు మద్దుతు ఇవ్వాలని సూచించింది. దీనికి సీఎం అంగీకరించలేదు. దీంతో సీపీఎం సీఎం వినతిని తోసిపుచ్చింది. మిగిలిన 16 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామని, కానీ భువనగిరి బరిలో కొనసాగుతామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.
కామ్రేడ్ల ఊహించని షాక్తో సీఎంకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనయిందని పలువురు చర్చిం చుకుంటున్నారు. మిగతా చోట్ల పోటీ ఎలా ఉన్నా భువనగిరిలో కాంగ్రెస్కు మిత్రపక్షాల నుంచి పోటీ తప్పేలా లేదు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.