Amethi | గాంధీ కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి (Amethi ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ (Kishori Lal Sharma) ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
కాగా, గత కొన్నిరోజులుగా నెలకొన్న సస్పెన్స్కు తెరదించుతూ.. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి, అమేథి లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అమేథి నుంచి రాహుల్ పోటీ చేస్తారంటూ ముందుగా ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా చివరి నిమిషంలో రాహుల్ను రాయ్బరేలి స్థానం నుంచి హస్తం పార్టీ బరిలోకి దింపింది. ఇక అమేథిలో గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్ శర్మకు (Kishori Lal Sharma) అవకాశం కల్పించింది.
#WATCH | Uttar Pradesh: Congress leader Kishori Lal Sharma files his nomination papers from Amethi for the upcoming #LokSabhaElection2024
BJP has fielded Union Minister Smriti Irani from Amethi. pic.twitter.com/DU72NFgONV
— ANI (@ANI) May 3, 2024
కిశోరీ లాల్ శర్మ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహిత వ్యక్తి. నాలుగు దశాబ్దాలుగా ఆయనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. పంజాబ్లోని లుథియానాకు చెందిన ఆయన 1983లో రాజీవ్ గాంధీతో కలిసి అమేథి, రాయ్బరేలీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయన గాంధీ కుటుంబంతోనే కొనసాగుతూ.. కీలక నేతగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను కిషోరీ లాల్ శర్మనే చూసుకుంటున్నారు. 2004లో రాహుల్ గాంధీ తొలిసారిగా అమేథి నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పుడు కూడా అక్కడ కేఎల్ శర్మ ఉన్నారు. ఇరవైఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ స్థానంలో అమేథి నుంచి కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఆయనకు స్థానిక నేతలు, ప్రజలతో మంచి సత్సంబంధాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Amethi | కాంగ్రెస్ కంచుకోటలో ‘శర్మ’లు.. మళ్లీ 21 ఏళ్ల తర్వాత అమేథి బరిలో గాంధీయేతరులు
Rahul Gandhi | వీడిన ఉత్కంఠ.. రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి