రాయ్పూర్ : కరోనా మహమ్మారి రెండో దశలో పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు ఎందరో రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు మహమ్మారి కాటుకు బలయ్యారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కరుణా శుక్లా సోమవారం రాత్రి ఛత్తీస్గఢ్లోని హాస్పిటల్లో కన్నుమూశారు. కరోనా బారినపడ్డ ఆమె చికిత్స పొందుతున్నారు. కరుణ శుక్లా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మేనకోడలు. ఆమె మృతిపై పలువురు కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..