హైదరాబాద్, మే 7: అక్షయ తృతీయ సందర్భంగా సీఎమ్మార్ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 12 వరకు ఉండనున్న ఈ ఆఫర్లలో ప్లెయిన్ జ్యూయలరీ తరుగు 3 శాతం నుంచి 9 శాతం వరకు మాత్రమే, యాంటిక్-స్టోన్-రోజ్గోల్డ్-విక్టోరయన్ జ్యూయలరీపై ఫ్లాట్గా 14 శాతం(అంతకుమించి తరుగు లేదు), వెండి వస్తువులపై తరుగు, మజూరిని ఎత్తివేసిన సంస్థ..డైమండ్ జ్యూయలరీ రూ.49,900 ప్రారంభ ధరతో లభించనున్నాయని తెలిపింది.
అలాగే నచ్చిన ఆభరణాలను అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. బుక్ చేసిన రోజు లేదా డెలివరీ తీసుకునే రోజు రేట్లలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు కొనుగోలు చేయవచ్చును.