అమరావతి : కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ 400 సీట్లు వస్తాయంటూ మైండ్గేమ్ ఆడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్(Congress) , ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు.
ఏపీ ఎన్నికల్లో జరిగిన అల్లర్లపై ఆయన స్పందించారు. ఎన్నికలకు ముందు డీజీపీని మార్చకపోతే రాష్ట్రం వల్లకాడు అయ్యేదని పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే దాడులు జరిగాయని ఆరోపించారు. . రాజకీయ భవిష్యత్ కోసమే చంద్రబాబు బీజేపీతో జత కట్టారని విమర్శించారు. ఓటమి దిశగా ఉన్న వైసీపీ వారు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఏపీలో అవినీతిని ఎన్ని రకాలుగా చేయవచ్చో జగన్ మోహన్రెడ్డి వద్ద నేర్చుకోవాలని వెల్లడించారు.