హైదరాడాద్ : బీజేపీ నాయకురాలు డీకే అరుణపై(DK Aruna) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధాని మోదీ చేతిలో కత్తి అయ్యి పాలమూరు కడుపులో పొడుస్తున్నదని ఆరోపిం చారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) ప్రచారంలో భాగంగా మంగళవారం కొడంగల్ నియోజకవర్గంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ నీకు నాకు పోటీ ఏంటి? నీ దగ్గర ఉన్నదేంటి నేను ఆశించేది ఏంటని ప్రశ్నించారు.
మోదీ పంచన చేరి పాలమూరు అన్యాయం చేస్తున్నావని పేర్కొన్నారు. కృష్ణా జలాలను మద్దూరు రాకుండా డీకే అరుణ అడ్డుకుందని విమర్శించారు. పీసీసీ పదవి, సీఎం పదవిని కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ ఇచ్చిం దన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ అందరి సమస్యలు తీరుస్తున్నానని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రచారం కూడా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఒకసారి వచ్చి మళ్లీ రాలేదు. కానీ, పార్లమెంట్ ఎన్నికలకోసం ఇప్పటికే కొడంగల్కు 5 సార్లు వచ్చానని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలన్నారు.