SBI | ముంబై, మే 9: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అదరగొట్టింది. మార్చి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,384.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,093.84 కోట్లతో పోలిస్తే 18.18 శాతం అధికమని పేర్కొంది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ లాభం రూ.16,694.51 కోట్ల నుంచి రూ.20,698.35 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1.06 లక్షల కోట్ల నుంచి రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నది.