HPCL | న్యూఢిల్లీ, మే 9: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్పీసీఎల్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రిఫైనింగ్ మార్జిన్లు తగ్గుముఖం పట్టడంతో గత త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 25 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను సంస్థ రూ.2,709.31 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. మరోవైపు, బోనస్ కింద ప్రతి రెండు షేర్లకు ఒక్క షేరును ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది.