రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని యూనివర్సిటీల్లో కలిపి దాదాపు 3,500 పైచిలుకు ఖాళీలున్నాయని వెల్లడించారు.
కామన్ బోర్డు ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వేరే రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ ఖాళీల వివరాలను తెప్పించుకొని, వాటికనుగుణంగా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఈ నియామకాలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు చెప్పారు.