పాన్గల్, ఏప్రిల్ 28 : ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మల్లాయిపల్లిలో ఆదివారం బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ అధికారం కోసం పరితపించే నా యకుడు కావాలా? ప్రజాసమస్యలపై పోరాడే నా యకుడు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మంచి ఆలోచనాపరుడు.. పరిపాలన దక్షత కలిగిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని కోరారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వి మర్శించారు. అబద్ధాల నిచ్చెన మెట్లు ఎక్కిన వ్యక్తి రేవంత్రెడ్డి అని ఆరోపించారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ఎంపీగా తనను గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అహంకారానికి, ఆశయానికి జరుగుతున్న పోరాటంలో తుదితీర్పు ప్రజలదేనని, కారు గుర్తుకు ఓటేయాని కోరారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, అభిలాష్రావు, అడ్వకేట్ రవి, రాజేశ్రెడ్డి, బుచ్చిరెడ్డి, జనార్దన్రెడ్డి, నరసింహానాయుడు తదితరులు పాల్గొన్నారు.