BRS Party | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీరు, కరెంట్ కొరత ఉందని విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంట్ కోత ఉందనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అని పేర్కొంటూ ఓ ఫేక్ సర్క్యులర్ను రేవంత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం ఉండాలి. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మవి నువ్వు.. వెళ్ళి, నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంట్ కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు.. నిన్ను ఉరికిస్తరు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్, మీ మాటలు ఫేక్.. చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే… అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యూలర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే.. ఎంత అభద్రతాభావంతో బతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి, దబాయించి పాలన సాగిద్దాం అనుకుంటే ప్రజలు నీ లాగుల తొండలు ఇడుస్తరు.. ఖబడ్దార్! అంటూ రేవంత్ను బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది.
అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది నువ్వే! @revanth_anumula
గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యూలర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలి.… https://t.co/zJveJnixnK pic.twitter.com/MsX2zc1FKs
— BRS Party (@BRSparty) April 30, 2024