Padma Rao Goud | అడ్డగుట్ట, ఏప్రిల్ 26: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా… ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మెట్టుగూడ డివిజన్లో శుక్రవారం పద్మారావుగౌడ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెబుతున్నారని ఆయన అన్నారు. సికింద్రాబాద్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 5 గంటలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో సల్మాన్ హోటల్, గోకుల్ సినిమా హాల్ వద్ద రోడ్షో ప్రారంభమవుతుందన్నారు.