Manne Krishank | హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. రూ. 25 వేలతో కూడిన 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మన్నె క్రిశాంక్ను మే 1వ తేదీన మధ్యాహ్నం చౌటుప్పల్ దగ్గర అరెస్టు చేశారు.