కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్ ప్రావిన్స్లో జరిగిన బాంబు పేలుడులో 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అబ్కమారి జిల్లా గవర్నర్ ఖుదాదాద్ తయ్యద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాద్గిస్ ప్రావిన్స్లోని అబ్కామారి జిల్లాలో రోడ్డు పక్కన ఈ పేలుడు సంభవించంది. స్థానిక సమయం శనివారం సాయంత్రం 5 గంటలకు అబ్కమారి జిల్లాలోని చలంక్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. బాంబు దాడులకు తాలిబాన్ ఉగ్రవాదులే కారణమని అబ్కామారి జిల్లా గవర్నర్ ఆరోపించారు, అయితే ఈ పేలుడుకు ఇంకా ఎవరు కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.
ఆఫ్ఘన్ దళాలు-తాలిబాన్ల మధ్య అనేక రోజులుగా కొనసాగుతున్న వివాదం కారణంగా దేశంలో హింస ఎక్కువైంది. గత 24 గంటల్లో కనీసం 10 ప్రావిన్స్లలో ప్రభుత్వ దళాలు-తాలిబాన్ల మధ్య ఘర్షణలు జరిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు.
నురిస్తాన్ ప్రావిన్స్లోని మరో జిల్లాను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్స్ నురిస్తాన్లోని దోవాబ్ జిల్లా ఆక్రమణ కోసం పోరాటం 20 రోజులుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మార్గాలను ఉగ్రవాదులు అడ్డుకున్నారు. ఆహార సామాగ్రి, మందుగుండు సామగ్రిని లేకపోవడంతో పట్టుకోల్పోయిన భద్రతా దళాలు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం తాలిబాన్లు నుంగ్రామ్ను కూడా చుట్టుముట్టారు. గత మూడు రోజుల్లో మూడు జిల్లాలు తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చాయి. కాగా, కాబూల్లో శనివారం జరిగిన బాంబు పేలుడులో మహిళా జర్నలిస్టుతో పాటు నలుగురు మృతి చెందారు. బాగ్లాన్లో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో పాటు భద్రతా దళంలోని ఎనిమిది మంది సభ్యులు మరణించారు.
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత మేనల్లుడు
ఐరాస నివేదిక : అల్-ఖైదా అధినేత జవహరి బతికే ఉన్నాడు..
లినెథోల్మ్ ద్వీపం : సముద్ర మట్టం పెరగకుండా డెన్మార్క్ సృష్టి
పర్యావరణ హితం : చెట్టుపై ఇల్లు కట్టిన ఐఐటీయన్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..