పాలమూరు, మే 7 : అమలుకాని హామీలతో రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెం ట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు మహబూబ్నగర్ రూరల్ మండలం జైనల్లిపూర్, ఫత్తేపూర్, మాచన్పల్లి, కోటకదిర, పోతన్పల్లి, జిల్లా కేంద్రంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అ న్ని వర్గాల సంక్షేమానికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. పోరాటాల ద్వారా సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయించినట్లు తెలిపారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను గారడీ చేశారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. రైతుబంధు సాయం అందించకుండా.. రుణమాఫీ పేరుతో కాలయాపన చే స్తూ రైతులను చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. పంటలు నష్టపోయి రైతులు ఇక్కట్లు పడుతున్నా ఒక్క మంత్రి, ఎమ్మెల్యేలు పోయి పరామర్శించడం గానీ.. పరిహారం ఇవ్వడం గానీ జరగలేదన్నారు. రైతులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో పథకాలను రేవంత్ సర్కారు నిలిపివేసిందన్నారు. సాగు, తాగునీరు లేక రైతులు, ప్రజలు తండ్లాడుతున్నారని చె ప్పారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితి మళ్లీ కనిపిస్తుందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులను బే రీజు వేయాలని సూచించారు. పదేండ్లలో తెలంగాణను అన్ని రంగాలలో దేశంలోనే ముందు వరుసలో నిలబెట్టామని గుర్తు చేశారు. ఇప్పటికీ హస్తం పార్టీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మితే మరోసారి గోస తప్పదని హెచ్చరించారు. 70 ఏండ్ల నుంచి మహబూబ్నగర్ను ఎవ రూ పట్టించుకోలేదని, పదేండ్ల కాలంలోనే పూర్తిస్థాయి లో అభివృద్ధి చేశామన్నారు. గ్రామాలకు రోడ్లు.. నీళ్లు.. మహిళా సంఘాలకు భవనాలు, పార్కులు.. ఇలా ఎన్నో వసతులు కల్పించామన్నారు. కృష్ణానది నుంచి నీటిని మళ్లించి తాగునీరు అందించామన్నారు. కానీ నే డు తాగునీరు రోజు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ హ యాంలో కరెంట్ నిమిషం కూడా పోకుండే.. నేడేమో ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇవ్వడం లేదని ధ్వజమెత్తా రు. వృద్ధులు, దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఇవ్వడం లేదని, గ్యారెంటీలు అటకెక్కాయని విమర్శించారు. నా డు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేదంటే అర్ధరాత్రి, అపరాత్రి వెళ్లేటోళ్లమని, ప్రస్తుతం ఒక్కరూ కూడా వెళ్లడం లేదన్నారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీకి ఓటరులు చెక్ పెట్టాలని కోరా రు. అనంతరం పోతన్పల్లి గ్రామంలో పలువురు నేత లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రచారంలో గ్రంథాల య సంస్థల మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్రెడ్డి, ఆంజనేయులు, రాఘవేందర్గౌడ్, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిపించారని, ఐ దేండ్లల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మరోసారి తనను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్లో గళం వినిపిస్తానని చెప్పారు. ఎన్నికల వేళ మాయమాటలు చెప్పేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాలు, పట్టణాలకు వస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మితే మరోసారి మోసపోవడం ఖాయమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మంచి చేసే పార్టీలు, నేతను ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓటేసే ముందు కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పదేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూడాలన్నారు. ఆలోచన లే కుండా ఓటేస్తే గాయ్.. గాయ్.. గత్తర్ గాళ్లు గెలిచి మన బాగోగులు పట్టించుకోరన్నారు. అందుకే తనను మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థించారు.