కొత్తగూడెం క్రైం, మే 6: కేంద్రమంత్రి అమిత్షాపై సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నాయకులు సోమవారం కొత్తగూడెం వన్టౌన్ ఎస్హెచ్వో ఎం కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని’ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అన్నట్టు ఈ నెల 4న కొత్తగూడెం కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేసినట్టు తెలిపారు.