న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ సోమవారం ట్రేడింగ్లో 4.5 శాతం లబ్ధి పొంది 58,300 డాలర్లను తాకింది. గతవారంలో బిట్ కాయిన్ విలువ పెరుగడం ఇదే తొలిసారి. ఈ నెలారంభంలో 61వేల డాలర్ల పైచిలుకు వరకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
తమ ఖాతాదారులు తమ లావాదేవీలను సెటిల్ చేసుకోవడానికి క్రిప్టో కరెన్సీని ఉపయోగించేందుకు అనుమతినిస్తున్నట్లు తాజాగా ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ వీసా ఇంక్ ప్రకటించింది.
ఆర్థిక సేవల రంగంలో డిజిటల్ కరెన్సీలకు ఆమోదం పెరుగుతున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో వీసా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఫైనాన్సియల్ టెక్నాలజీ సంస్థలకు సేవలందించేందుకు తమ నిర్ణయం పాక్షికంగా ఉపకరిస్తుందని వీసా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ జాక్ ఫోర్స్టెల్ తెలిపారు. తమ వ్యాపారాన్ని, డిజిటల్ కరెన్సీలోని సంక్లిష్టతలను అర్థం చేసుకున్న సంస్థలతో భాగస్వామ్యం కావాలని క్రిప్టో ఆధారిత ఫిన్ టెక్ సంస్థలు కోరుతున్నాయ్నారు.
2009లో బిట్ కాయిన్ను క్రియేట్ చేసిన తర్వాత దాదాపు పుష్కర కాలం దాటిన తర్వాత పలు సంప్రదాయ ఆర్థిక సేవల సంస్థలు క్రిప్టో కరెన్సీలను, బ్లాక్ చెయన్ టెక్నాలజీల వినియోగాన్ని ప్రారంభించాయి.
మోటార్ ఫీల్డ్కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!