న్యూఢిల్లీ: సొంత ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారా..! ప్రత్యేకించి ఎంఐజీ-1, ఎంఐజీ-2 క్యాటగిరీ ఇండ్లను కొనుక్కునే వారికి పీఎంఏవై సీఎల్ఎస్ఎస్ కింద సబ్సిడీ పొందవచ్చు. అయితే ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ క్యాటగిరీల కింద ఇండ్లు కొనే వారికి రాయితీ లభిస్తుంది. ఇక ఇతర క్యాటగిరీలైన ఎల్ఐజీ/ఈడబ్ల్యూఎస్ విభాగాల్లో ఇండ్లను కొనుగోలు చేసే వారికి పీఎంఏవై సీఎల్ఎస్ఎస్ కింద వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పొడిగించింది కేంద్రం.
మధ్యతరగతి ప్రజల కోసం రూపొందించిందే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీం (సీఎల్ఎస్ఎస్).. ఎంఐజీ-1, ఎంఐజీ-2 స్కీమ్ ఇండ్ల కొనుగోలు దారులకు ఈ సీఎల్ఎస్ఎస్ స్కీమ్ అమలును 2017 నుంచి ప్రారంభించారు. తదుపరి దానిని 2020 మార్చి వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. గతేడాది మే 14వ తేదీన.. చౌక ధరకు ఇల్లు కొనే వారికి ఈ రాయితీ కల్పించే గడువు 2021 మార్చి నెలాఖరు వరకు పొడిగించింది.
ఈ స్కీమ్ కింద సబ్సిడీ పొందాలంటే రుణాలు తీసుకున్న లబ్ది దారులకు కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రత్యేకించి మూడు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం..
రుణ గ్రహీత వార్షిక ఆదాయం ఆర్థికంగా బలహీన సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద రూ.3 లక్షల్లోపు ఉండాలి. స్వల్పాదాయ వర్గాల ఆదాయం వార్షికంగా రూ.3-6 లక్షలు ఉండాలి. ఈ రెండు వర్గాల వారికి గరిష్ఠంగా రూ.2.67 లక్షల సబ్సిడీ లభిస్తుంది.
మధ్య తరగతి కుటుంబాలకు చెందిన రుణ గ్రహీత ఎంఐజీ-2 ఇంటి కోసం రుణం తీసుకున్న వ్యక్తి ) ఆదాయం రూ.6-12 లక్షలు, ఎంఐజీ-2 ఇంటి రుణం తీసుకున్న వ్యక్తి ఇన్కం రూ.12-18 లక్షల మధ్య ఉండాలి. ఈ గ్రూప్ వారికి రూ.2.3 లక్షలు, రూ.2.35 లక్షల సబ్సిడీ అందుతుంది.
ఇక ఈడబ్ల్యూస్, ఎల్ఐజీ క్యాటగిరీ కుటుంబాల రుణ గ్రహీత వార్సిక ఆదాయం రూ.6 లక్షల వున్న వారికే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఎంఐజీ-1 రుణ గ్రహీతల వార్షిక ఆదాయం రూ.9 లక్షలు, ఎంఐజీ-2 క్యాటగిరీ రుణ గ్రహీతల వార్షిక ఆదాయం రూ.12 లక్షల్లోపు ఉన్న వారికి సబ్సిడీ వర్తిస్తుంది.
రుణ గ్రహీతకు సంబంధిత పట్టణంలో సొంతిల్లు ఉండకూడదు. మూడో షరతు ఏమిటంటే రుణ గ్రహీతతోపాటు మహిళ సహ యజమాని కం సహ-రుణగ్రహీతగా ఉండాలి. ఈ సబ్సిడీ పొందడానికి రుణ గ్రహీత సీఎల్ఎస్ఎస్తోపాటు పీఎంఏవై స్కీమ్ కింద రుణానికి దరఖాస్తు చేసుకోవాలి.
రుణ గ్రహీతకు అర్హత ఉంటే, సబ్సిడీ వర్తింప చేయాలని బ్యాంకర్.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరతారు. ఇప్పుడు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లు కేంద్ర నోడల్ ఏజెన్సీలుగా ఉన్నాయి.
సంబంధిత కేంద్ర నోడల్ సంస్థలు.. ఆయా రుణ గ్రహీతల అప్లికేషన్ను క్రాస్ చెక్ చేస్తాయి. నిబంధనల ప్రకారం సదరు రుణ గ్రహీత.. ఆ సబ్సిడీకి అర్హుడైతే.. నేరుగా రుణ గ్రహీత లోన్ ఖాతాలో సబ్సిడీ నిధులు జమ చేస్తాయి. తద్వారా రుణ గ్రహీత చెల్లించాల్సిన ఈఎంఐ తగ్గుతుంది. అయితే, కేంద్ర నోడల్ సంస్థలు మీ సబ్సిడీ అప్లికేషన్ను పరిశీలించి సబ్సిడీ నిధులు విడుదల చేయడానికి ఆరు నెలల టైం పడుతుంది.
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!