న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ జాబితా (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ – ఈయూఎల్) గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ ప్రతినిధులతో సమావేశం పూర్తయిందని పేర్కొంది. కంపెనీ సమర్పించిన డేటాను సాకేంతిక నిపుణుల కమిటీ విశ్లేషిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ పేర్కొన్నారు. కంపెనీ సమర్పించిన సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు.
ఇప్పటి వరకు ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్స్, సినోవాక్, సినోఫార్మ్ టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కింద గుర్తింపు జారీ చేసినట్లు తెలిపారు. భారత్ బయోటెక్ వ్యాక్జిన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత్ బయోటెక్ ఈ నెల తొలివారంలో అందజేసిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందంగా వాటిని పరిశీలిస్తుందని పూనమ్ ఖేత్రపాల్ పేర్కొన్నారు. మరో వైపు డబ్ల్యూహెచ్ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్’ కార్యక్రమం ద్వారా భారత్కు 7.5 మిలియన్ మోడెర్నా డోసులు అందించనున్నట్లు పేర్కొన్నారు.
వంద దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి
కరోనా డెల్టా వేరియంట్ వంద దేశాల్లో వ్యాప్తి చెందిందని పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాబల్యం కలిగిన వేరియంట్గా అవతరించనుందని అన్నారు. డెల్టా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో పలు దేశాల్లో కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు వైరస్ కట్టడి చర్యలు సమర్థంగా చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ‘అత్యవసరంగా’ పని చేయాని, థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రజలకు టీకాలు వేయాలని కోరారు. గత పది వారాలుగా, కొన్ని తూర్పు మధ్యధరా, యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయని తెలిపారు. భారత్, నేపాల్, మాల్దీవుల్లో కేసులు తగ్గుతున్నాయని చెప్పారు.