గద్వాల, మే 5 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం తో ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీలో 2,3,6,9 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించుకొని నడగడ్డను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. గ త ప్రభుత్వాల కాలంలో గద్వాల మున్సిపాలిటీకి రూ.5 కోట్లులేదా రూ.10కోట్ల నిధులు మాత్రమే వచ్చేవన్నా రు. కేసీఆర్ హయాంలో రూ.100 కోట్లు ఇచ్చారని, వాటితో గద్వాలను ఎంతగానో అభివృద్ధి చేసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఫ్రీ బస్ తప్పా ఏదీ ఇప్పటి వరకు అమలు చేయలేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే రుణమాఫీ చేస్తామని చెప్పి దీనిపై ముఖ్యమంత్రితోపాటు మంత్రులు రైతులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వలేక పోతున్నారన్నారు.
చాలా మందికి రైతుబంధు రాలేదని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు అంటూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని వారి మాటలు ప్రస్తుతం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నాయకులు మతం,ధర్మం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కు లం, మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 9వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు లక్ష్మీనర్సమ్మ, మురళి, నాగలత, నాగిరెడ్డి, నరహరిశ్రీనివాసులు, దౌలు, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి, జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, సాయిశ్యాంరెడ్డి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.