తిరువనంతపురం : కేరళలో కొలువుదీరిన కొత్త ఎల్డీఎఫ్ ప్రభుత్వం తమ మొదటి బడ్జెట్ను ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్స్ సమర్పించిన మునుపటి బడ్జెట్కు పొడగింపుగా ఈ బడ్జెట్ అవుతుంది. కొత్త బడ్జెట్లో కొన్ని చేర్పులు మినహా మునుపటి బడ్జెట్లో పెద్ద మార్పులు ఉండవని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇదివరకే స్పష్టం చేశారు.
అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేఎన్ బాలాగోపాల్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కట్టడికి తొలి వేవ్లో రూ.20 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్లో ఆరోగ్యం, సామాజిక , ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవటానికి రూ.20 వేల కోట్ల మరో ప్యాకేజీని ప్రకటించారు. ఫైనాన్షియల్ ప్యాకేజీతో పాటు 18 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు ఇచ్చేందుకు రూ.1000 కోట్లను ప్రకటించారు. ఉచిత టీకాలు వేయడానికి అవసరమైన పరికరాలు, సౌకర్యాలు సమకూర్చేందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఎల్డీఎఫ్ తన మ్యానిఫెస్టోలో వివిధ రంగాలలో కొత్త ప్రాజెక్టులతో పాటు 900 వాగ్దానాలను ఇచ్చింది.
ప్రాజెక్ట్ 75 : రూ.50 వేల కోట్లతో 6 జలాంతర్గాముల నిర్మాణం
కరోనా టైం: సప్లిమెంట్స్ నకిలీలను ఇలా కనిపెట్టండి..!
పోస్ట్-కొవిడ్ ఫిట్నెస్ : నిత్యం 10 కి.మీ పరిగెత్తుతున్న మిలింద్ సోమన్
ముమ్మాటికీ బెట్టింగే : లూడోను లక్కీ గేమ్గా ప్రకటించాలని పిటిషన్
లాక్డౌన్ ఎఫెక్ట్ : పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం
కింగ్ కోబ్రా : శివాలిక్ కొండల్లో దర్శనం
ఐఐటీయన్ల ప్రతిభ : అందుబాటులోకి హై ఫ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్
చైనా చరిత్రలో మరిచిపోలేని మరక.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..