వరంగల్ : పూర్వికుల ఆస్తిని తన పేరుపై మ్యూటేషన్ కోసం సంప్రదించిన బాధితుడి నుంచి లంచం( Bribe ) డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ( Revenue Inspector ) ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తహసీల్ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న జి రాంబాబు ( Rambabu ) బాధితుడి నుంచి రూ. 10 వేలు తీసుకుంటుండగా గురువారం వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
నగదును స్వాధీనం చేసుకుని ఆర్ఐపై కేసు నమోదు చేసి వరంగల్ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు ఏసీబీ అధికారులు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 అనే నంబర్కు ఫిర్యాదు చేయాలని, వాట్సప్ నంబర్ 9440446106కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.