అహ్మదాబాద్: ఆయిల్ ట్యాంకర్ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Bus Catches Fire) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లగ్జరీ ప్రైవేట్ బస్సు 40 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి రాజ్కోట్ వైపు వెళ్తున్నది.
కాగా, గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోటిలా-రాజ్కోట్ జాతీయ రహదారిలోని సంగని గ్రామం సమీపంలో టైర్ పేలడంతో ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు ఆ ట్యాంకర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. బస్సులోని ప్రయాణికులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
మరోవైపు నలుగురు ప్రయాణికులు మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. మరో పది మందికి కాలిన గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేయడంతోపాటు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
4 Killed After Private Bus Catches Fire Near Chotila https://t.co/Lp3KzGeaDU pic.twitter.com/AfsaoYFiqV
— DeshGujarat (@DeshGujarat) May 14, 2026