BRICS : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S Jaishanker) ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో ప్రపంచ, ప్రాంతీయ సమస్యలు, ముఖ్యంగా పశ్చిమాసియా (West Asia) పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు హాజరైన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీ (PM Modi) ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక్కొక్కరుగా వచ్చి వేదికపై ఉన్న ప్రధానిని కలిసి కరచాలనం చేశారు. అతనంతరం అందరు కలిసి ప్రధానితో గ్రూప్ ఫొటో దిగారు. ప్రధానితో విదేశాంగ మంత్రులు కలిసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Prime Minister Narendra Modi meets with BRICS Foreign Ministers, in Delhi.
India is hosting the BRICS Foreign Ministers’ Meeting on 14–15 May 2026. pic.twitter.com/cTjUmKrpAb
— ANI (@ANI) May 14, 2026
బ్రిక్స్ విదేశాంగ మత్రుల సమావేశానికి ముందు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో పలు ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరాలతో కూడా ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సాయంత్రం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా జైశంకర్ సమావేశమవుతారు.