ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ఇవాళ టూవీలర్ నడిపారు. పొదుపు చర్యల్లో భాగంగా ఆయన తన కాన్వాయ్ తగ్గించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బైక్ నడిపారు. ఇంధనం ఆదా చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఫడ్నవీస్.. విధాన భవన్కు బైక్పై వచ్చారు. హెల్మెట్ ధరించిన ఆయన పిలియన్ రైడర్తో సభకు చేరుకున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం గ్రామీణ స్థాయి వరకు చేరాలన్న ఉద్దేశంతో బైక్పై ప్రయాణించినట్లు సీఎం ఫడ్నవీస్ తెలిపారు. తమ కాన్వాయ్ సైజ్ను కూడా తగ్గించుకున్నట్లు చెప్పారు. రాబోయే ఆరు నెలల వరకు ప్రభుత్వం ఎటువంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోదన్నారు.
Devendra Fadnavis today travelled by bike from Varsha Residence to Vidhan Bhawan in Mumbai, escorted by two security personnel who were also on bikes.#SavePetrol #pmmodiappeal pic.twitter.com/MBjKWiQzHK
— Shehla J (@Shehl) May 14, 2026