హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎయిర్ కూలర్ల సంస్థ సింఫనీ..అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.48 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16 కోట్ల లాభంతో పోలిస్తే రెండింతలు లేదా 200 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.308 కోట్ల నుంచి రూ.332 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.8 లేదా 400 శాతం డివిడెండ్ను ప్రతిపాదించింది.