చెన్నై : తమిళనాడులో రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కడలూర్లోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ గురువారం పేలింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాయిలర్ పేలుడుకు కారణాలు తెలియరాలేదు. మృతుల బంధువులు, క్షతగాత్రుల బంధువుల రోధనలు మిన్నంటాయి. పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.