హైదరాబాద్ : బొల్లారంలోని(Bollaram) ట్రాన్స్కో ఉద్యోగి(Transco employee) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు(ACB raids) చేపట్టారు. రూ.34 లక్షలు, 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్న అనిల్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఫిర్యాదుతో దాడులు నిర్వహించారు. ఏఈ అనిల్ రెడ్డి నివాసంలో కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అతడి బంధువుల ఇండ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, గతంలో రూ.12 వేలు లంచం తీసుకుంటూ అనిల్రెడ్డి పట్టుబడ్డాడు.