పూరీ: ఒడిశాలోని పూరీ బరిలో కాంగ్రెస్ (Congress) పార్టీ మరో అభ్యర్థిని నిలిపింది. ఎన్నికల ఖర్చులకు తనవద్ద డబ్బులు లేవంటూ పోటీచేయలేనని సుచరితా మొహంతీ (Sucharita Mohanty) టికెట్ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వం శనివారం రాత్రి జై నారాయణ్ పట్నాయక్ను (Jay Narayan Patnaik) పూరీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మొహంతీ స్థానంలో పట్నాయక్ అభ్యర్థిత్వానికి ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒప్పుకున్నారని చెప్పారు.
మాజీ ఎంపీ బ్రజామోహన్ మహంతీ కుమార్తే, మాజీ జర్నలిస్టు అయిన సుచరితా మొహంతీని కాంగ్రెస్ పార్టీ పూరీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాను పోటీ చేయనని, టికెట్ను తిరస్కరించారు. తనవద్ద ఉన్న డబ్బును ఖర్చు చేసేశానని, ఆర్థిక సహకారం అందించేందుకు పార్టీ అధిష్ఠానం నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని ఆమె ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, పూరీ లోక్సభ స్థానానికి ఆరో విడుతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6 వరకు గడువు ఉన్నది. సుచరిత ఇప్పటివరకు తన నామినేషన్ దాఖలు చేయకపోడం గమనార్హం.