KTR | కంటోన్మెంట్, మే 4: కంటోన్మెంట్ ప్రజలకు అన్నివిధాలుగా బీఆర్ఎస్ తోడుగా, అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు బాలంరాయి అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తు ఉన్న లాస్యనందితను మృత్యువు వెంటాడిందన్నారు. లాస్యనందిత మృతి అందరినీ షాక్ కు గురి చేసిందన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు తనువు చాలించడం చాలా బాధాకరమన్నారు. అలాంటి కుటుంబానికి అండగా నిలవాలని కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నా..పార్టీ ఆదేశానుసారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నివేదిత బరిలో ఉన్నారని వెల్లడించారు. నివేదితను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కంటోన్మెంట్తో పాటు మల్కాజిగిరి ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు అనితాప్రభాకర్, నళినికిరణ్, పాండుయాదవ్, లోక్నాథం, భాగ్యశ్రీ శ్యామ్కుమార్, మాజీ కార్పొరేటర్ రూపా హరికృష్ణ, మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, ఉద్యమకారుడు నర్సింహముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.