మొదక్ : మెదక్(Medak) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లి ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని చిన్నశివునూర్ చౌరస్తా వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చేగుంటలో నివాసం ఉంటున్న న్యాలపల్లి బాల్రాజు(45) అనే వ్యక్తి బైక్పై చేగుంటకు బైక్పై వెళ్తున్నాడు.
ఇదే సమయంలో అతడి బైక్ను(Bike) కారు ఢీ కొట్టింది. కిందపడ్డ అతడిపై నుంచి కంటెనర్ వాహనం దూసుకెళ్లడంతో అక్కక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ బాల్రాజు తెలిపారు. బాల్రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.